*రాముడి  యొక్క ధర్మాచరణ*

🙏🏻జై శ్రీమన్నారాయణ🙏🏻

ధర్మాచరణ గురించి రామాయణం లో వాల్మీకి రెండు గుణాలు చెప్పారు. ఒకటి: “ధృతి” రెండు: “నియమం”. శ్రీరాముడు అడవులకి వెళ్ళే ముందు తల్లి కౌసల్యకి నమస్కరించాడు. ఆమె “ధర్మ మార్గం లో నడువు” – అని ఉపదేశించలేదు. రాముడు ధర్మావతారం. ఆయన స్వభావం ధర్మరక్షణ. “ధర్మంచర” అని ఆయనకొకరు చెప్ప బని లేదని తల్లికి తెలుసు. అందుకని ఆమె ఇలా ఆశీర్వదించింది. “నీవు ధృతి (ధైర్యం), నియమాలతో ఏ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నావో, ఆ ధర్మమే  నిన్ను రక్షించు గాక!” ప్రతీ భారతీయునికి రాముని శీలమే ఆదర్శం. రామనామమే మహామంత్రం. మనలను నేడు పీడిస్తున్న అన్ని జబ్బులకి అదే మందు.

ధర్మ  మార్గమే  నిజమైన భక్తి యని  రాముఁడు
నమ్మాడు .  ధర్మమే మనకూ , మన  కుటుంబాలకు , మన సమాజానికి , హితకారియై  ఈశ్వరానుగ్రహాన్నిస్తుంది . థర్మాన్ని రక్షిస్తే  ధర్మం మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. అందుకే రాముడికి  సీతకంటే కూడా , ధర్మం అంటేనే ఇష్టం. ఇదే థర్మాన్ని
పాటిస్తే  మనమూ దేవునిపట్ల  నిజమైన
భక్తి  కలిగియున్నవారమవుతాము.

శ్రీరాముఁడు  ధర్మ నిష్టా గరిష్టుడు.  ఏ కాలంలో నైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా , ధర్మలుబ్ధము   కాకూడదు, .అని రాముఁడు విశ్వశిస్తాడు. దానికి ఉదాహరణ ఒకటి.  

శ్రీరాముఁడు  వనవాసంలో యుండఁగా ,  భరత, శత్రుఘ్నుల వల్ల  తన పితృ వియోగ వార్త
తెలుసుకుని , చింతాక్రాంతుడై  విలపించి ,
తనకు  విహిత కర్మ  అయినటువంటి పితృకర్మ
ఆచరణకొరకు ,  ఆపద్ధర్మముగా అక్కడ  వన
వాసములో  లభించినటువంటి  కంద మూలా దులతో , గతించిన  తన తండ్రి దశరథుడికి ,
శ్రాద్దము  ఆచరించి , మందాకినీ నది  వద్ద
పితృదేవులకు  ఉదక తర్పణాలు ఇచ్చి , పితృ
దేవతలకు  సద్గతి కలుగచేశాడు.  

సుపంధానంతు  గచ్ఛంతం :-

రామాయణంలోని  అరణ్యకాండ మనకు
ఒక  గొప్ప  విషయాన్ని చెబుతుంది.  సీతా వియోగంలో ఉన్న శ్రీరాముఁడు  ఆమె కోసం
వెతుకుతూ , నదులను , చెట్లను,  పుట్టలను ,
కొండలను , గుట్టలను,  లేళ్లను , కుందేళ్ళను ,
ఇలా కనిపించిన  చరాచర జీవరాశి నంతటిని
సీత  గురించి  ప్రశ్నిస్తాడు.  ఆయనస్థితిని చూసి
తట్టుకోలేక , లేళ్ళు  యధాశక్తి ప్రయత్నించి ,
ఆయనకు  రావణ దుర్మార్గాన్ని  గురించి సూచించాయట. పర్ణశాలవైపు  చూడటం,
ఆపై  దక్షిణంగా  పరిగెత్తడం, ఆగి  ఆకాశంవైపు
చూసి  కంటనీరు  పెట్టడం ,ఇలా చేస్తున్నాయట.
ఇది  గమనించిన  రాముడికి పర్ణశాలలో ఉన్న
సీతను , ఎవరో  రాక్షసుడు ఎత్తుకుపోయి ,
ఆకాశమార్గంలో  దక్షిణదిశగా ప్రయాణించాడని
అర్థమైందిట . ఈ స్థితిని  వర్ణిస్తున్న వాల్మీకి
శ్లోకం , దీనస్థితిలో  పడిన ప్రతి సత్పురుషునికి
ఒక  ఓదార్పు  నిస్తుంది..
” సుపంధానంతు  గచ్ఛన్తం
  తిర్య o చొపి   సహాయతే
  కుపంధానంతు  గచ్ఛన్తం
  సోదరోపి  విముంచతి “

అంటే  మంచి మార్గంలో  పయనిస్తున్న వ్యక్తులకు , పశుపక్ష్యాదులు  కూడా సాయం
చేస్తాయట .  అందుకే రామునికి  లేళ్లు, జటాయువు, సంపాతి  , వానరులు కూడా
సాయం  చేశారు .  దుర్మార్గంలో  నడిచే వ్యక్తిని ,
సోదరుఁడు  కూడా విడిచిపెట్టి  వెళ్లిపోతాడుట.
రావణుని  విషయంలో సరిగ్గా  అదే జరిగింది .
ఇదే  వాల్మీకి  మహర్షి అరణ్యకాండలో  , మానవాళికి , చెప్పిన  మహాపదేశం. రామాయణ కాలానికే  కాదు , ఏ కాలానికైనా
ఏ  పరిస్తితుల్లోనైనా  వర్తించే మాటలివి .
అందుకే  కొండలున్నంతవరకు , నదులు  ప్రవహిస్తున్నంత కాలమూ , రామాయణం
ఉంటుందని , సృష్టికర్త  బ్రహ్మదేవుడు ఉద్ఘాటించిన  నగ్నసత్యం.
🙏🏻శ్రీమతే రామానుజాయనమః🙏🏻